*సిద్ధినేనిగూడెం పాఠశాలను తనిఖీ చేసిన కమల్ రాజు*

Published: Saturday December 17, 2022

మధిర రూరల్ డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) మండలంలోని సిద్ధినేనిగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శుక్రవారం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో తిరుగుతూ విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని  పరిశీలించిచారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు తరగతి గదులు సరిపోవటం లేదని, అదనపు తరగతి గదులు కావాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి  స్పందించిన ఆయన అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం నిధుల మంజూరు కు హామీ ఇచ్చారు. విద్యార్థులను ఉపాధ్యాయులు ఉన్నత స్థాయికి చేరేలా తీర్చిదిద్దలాని చదువులో మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిత్తారు నాగేశ్వరావు, రంగిశెట్టి కోటేశ్వరావు సొసైటీ అధ్యక్షులు కటికల సీతారామి రెడ్డి సర్పంచ్ వేమిరెడ్డి పెద్దనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు