ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం

Published: Friday November 04, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ 
వికారాబాద్ బ్యూరో 3 నవంబర్ ప్రజా పాలన :  ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఉర్సు ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేయిస్తామని వికారాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో గల మైబూబ్ సుభాని దర్గా దగ్గర అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేస్తామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు మున్సిపల్ అధికారులతో అక్కడికి వెళ్లిన చైర్ పర్సన్ దర్గా దగ్గర పరిస్థితులను పరిశీలించి, మట్టి నింపడం, ఇతర అవసరాలు ఏమి ఉన్న త్వరలో పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ముస్లిం సోదరులకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, ఏఈ రాయుడు, స్థానిక నాయకులు ఫెరోజ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అనంతరం గత సోమవారం డయల్ యువర్ చైర్ పర్సన్ కార్యక్రమంలో వచ్చిన మరో రెండు సమస్యలను చైర్ పర్సన్ పరిష్కరించడం జరిగింది. వాటిలో మున్సిపల్ పరిధిలోని 17వ వార్డు రాజీవ్ నగర్ లో, 29వ వార్డు కన్యాలాల్ బాగ్ కాలనీలలో గల రెండు యుజిడి (అండర్ డ్రైనేజ్) సమస్యను పరిష్కరించడం జరిగింది. కన్యాలాల్ బాగ్ లో యుజిడి లైన్ లెవెలింగ్ సరిగ్గా లేకపోవడంతో రిపేర్ చేసిన ప్రతిసారి సమస్య పునరావృతం అవుతుందని తెలుసుకున్న చైర్ పర్సన్ ఇట్టి సమస్య మరోసారి పునారవృతం కాకుండా లెవెలింగ్ సరి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక నాయకులు హసీబ్, ఏఈ రాయుడు, టిపిఎస్ వేణు, మున్సిపల్ సిబ్బంది, యాదయ్య శీను, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.