*సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ*

Published: Wednesday September 28, 2022
మధిర  సెప్టెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి పట్టణంలో పలువురికి సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను మంగళవారం మండల కాంగ్రెస్ కార్యాలయంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిర పట్టణానికి చెందిన శ్రీకాంత్ కి  22 వేల రూపాయలు మాగం నిఖీల్ కి ఏడు వేల ఐదు వందలు నండిపాటి మరియమ్మ కి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్, మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క   సిఫార్సుతో వారికి సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజల కష్ట కాలంలో భట్టి విక్రమార్క నిరంతరం అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్త కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు కౌన్సిలర్లు కోన ధని కుమార్ మునుగోటి వెంకటేశ్వర్లు యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు తుమాటి నవీన్ రెడ్డి సీనియర్ నాయకులు కర్నాటి రామారావు   పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పత్తే పరపు సంగయ్య మాగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.