మహాత్మ జ్యోతిబా పూలే 197వ జయంతి ** పద్మశాలి సేవా సంఘం కాగజ్ నగర్ **
Published: Wednesday April 12, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 11 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో పద్మశాలి సేవా సంఘం నాయకులు మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శి దాసరి వెంకటేష్, కొంగ సంపత్ కుమార్, నాయకులు కోసిని వద్ద సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు, గోవిందరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలకు ఆత్మ శౌర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు గోవిందరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం గౌరవాధ్యక్షులు నారాయణ, సమ్మయ్య, ఉపాధ్యక్షులు దత్తాత్రే, రవికుమార్, వీరయ్య, శంకరయ్య, సదాశివ్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: