ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ విధిగా వేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే ఎం.బిక్షపతి యాదవ్
Published: Wednesday March 24, 2021
శేర్లింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేర్లింగంపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎం.బిక్షపతి యాదవ్ మంగళవారం గచ్చిబౌలిలోని హిమగిరి హాస్పటల్లో కోవిడ్ నిరోధక వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బిక్షపతి యాదవ్ మాట్లాడుతూ బాధ్యత గల ప్రతి పౌరుడు కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే విధిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ఎలాంటి ఆరోగ్య ఏర్పడవని అన్నారు.
Share this on your social network: