కోవిడ్ టీకా వేసుకుంటున్న వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ యాదయ్య సాగర్

Published: Tuesday April 27, 2021
పరిగి, ఏప్రిల్ 26, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, కరోనా పెరుగుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని,ప్రతి ఒకరు భౌతిక దూరం పాటించి మాస్కు ధరించాలని వైస్ ఎంపీపీ గురుమిట్కల్ మల్లేశం, దోర్నాల పల్లి  సర్పంచ్ యాదయ్య సాగర్ అన్నారు. సోమవారం దోమ మండల కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారు l కోవిడ్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పాలనలో ఉన్న ప్రతి ఒక్క సర్పంచ్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ తీసుకోవలని అలాగే 45 సంవత్సరాలు దాటిన  ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ టీకా వేసుకోవాలన్నారు.