శేషాద్రి వంగల కు మోస్ట్ ఏంట్రప్రేన్యూర్ సి ఈ ఓ గా ఆసియా ఎక్సలెన్స్ అవార్డు

Published: Saturday June 04, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
ఐ ఫిన్ గ్లోబల్ గ్రూప్ సంస్థల సి ఈ ఓ శేషాద్రి వంగల కు లండన్ పార్లమెంట్ అందించే అత్యున్నత పురస్కారం ఆసియా ఎక్సలెన్స్ అవార్డు తో సత్కరించింది.2022 లో యూకే, భారత్ మధ్య వ్యాపారాత్మక సంబంధాలను నెలకొల్పడంలో విశేష కృషి సల్పినందుకు ఆయన ను ఈ అవార్డు తో సత్కరించినట్లు ఆయన తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో శేషాద్రి వంగల మాట్లాడుతూ గత వారం యూకే లో జరిగిన ఈ అవార్డు కార్యక్రమం లో  యుకేలోని ఆల్ ఇండియా పార్లమెంటరీ పార్టీకి చెందిన నవదీప్ మిశ్రా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వీరేంద్ర శర్మ,  లర్డ్ లుమ్బా, కాంగ్రెస్ 
పార్లమెంట్ నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక ఐటి శాఖ మంత్రి  అశ్వద్
నారాయణ, కేంద్ర ప్రభుత్వ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి  సల్మాన్ కుర్షీద్,
బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ తదితరుల సమక్షంలో తాను అవార్డు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. తమ కంపెనీ ఇండియా లో కూడా ఇప్పటికే నిపుణ కంపెనీ సహకారం తో రెండు రోజుల్లో పది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో తోడ్పడినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆయన సతీమణి, నిపుణ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.