ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

Published: Saturday April 15, 2023
జన్నారం, ఏప్రిల్ 14, ప్రజాపాలన:  
 
 
మండల కేంద్రంలోని వివిధ ప్రజా సంఘాలు, మండల అంబేద్కర్ సంఘం నాయకులు అంబేద్కర్ 132 జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అంబేద్కర్ సేవలను గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అరుణ రాణి, రాంపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం, గ్రామ సర్పంచ్ అలుగునూరి సులోచన , తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ జాడీ గంగాధర్ లు బేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాజ్యంగ పరిషత్తు సభ్యుడిగా- మంత్రివర్గ సభ్యుడిగా,  అంబేద్కర్ విశేష శ్రమ వహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టమని, అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, మామిడిపల్లి ఇందయ్య, దుమల్ల రమేష్, నారపాక రమేష్, దళిత సంఘం అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు పోనకల్ సర్పంచ్ జక్కు భూమేష్, తదితరులు పాల్గొన్నారు.