రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించాలి : కార్పొరేటర్ గీత ప్రవీణ్ ముదిరాజ్

Published: Thursday May 06, 2021
మేడిపల్లి, మే 5, ప్రజాపాలన ప్రతినిధి: చిల్కానగర్ డివిజన్లో వేస్తున్న బిటి రోడ్డు పనుల్లో నాణ్యతను పాటించాలని కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్  కాంట్రాక్టర్ మరియు అధికారులకు సూచించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా విసాతత్ ఎంక్లేవ్ కాలనీ బిటి రోడ్లు నిర్మాణం పనులను కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లోని అన్ని కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్లు, విద్యుత్ వంటి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ ఏఈ రాజ్ కుమార్, విసాతత్ ఎంక్లేవ్ కాలనీ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, పూర్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె నర్సింగ్ రావు, ఏదుల కొండల్ రెడ్డి, మాస శేఖర్, ఎ మహేందర్, బింగి శ్రీనివాస్, బాలు, ఎన్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు