మన ఊరు మన బడిలో భాగంగా ముష్టి కుంట పాఠశాలకు సందర్శించిన స్పెషల్ టీం

Published: Wednesday February 23, 2022
బోనకల్, ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం పరిధిలోని ముష్టి కుంట ఎంపిపిఎస్ఎస్ పాఠశాల మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సెలెక్ట్ అయినది. పాఠశాలకు కె.వి.కె శ్రీనివాస్ ఈఈ, ఎస్ ఉమారాణి బోనకల్ స్పెషల్ ఆఫీసర్, ఏ ఈ నవీన్ కుమార్ సందర్శించి ఏ సౌకర్యాలు అవసరమో తరగతి గదులను పరిశీలించి అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం రిక్వైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అరుణ కుమారి, నిర్మల, రంగారావు తదితరులు పాల్గొన్నారు.