ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి *పోస్ట్ మాస్టర్ మురళీధర్ రెడ్డి ని రాజున

Published: Wednesday February 22, 2023

మంగళవారం రోజున ఆదిభట్ల గ్రామంలో  బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి మురళీధర్ రెడ్డి అనతి కాలంలోనే ఆదిభట్ల గ్రామ ప్రజానీకానికి ఎంతో చేరువై పోస్టల్ సేవలను అందరికీ చేరవేస్తున్నాడు. గడపగడపకు పోస్ట్ ఆఫీస్" అనే నినాదంతో గ్రామంలో ప్రతిరోజు ఉత్తరాలు బట్వాడా చేసే సమయంలోను ఆదిభట్ల ప్రజలతో మమేకమై సత్సంబంధాలను కొనసాగిస్తూ ఆదిభట్ల గ్రామంలో  అత్యధిక చిన్న ముత్తాల పొదుపు ఖాతాలను (150వరకు) తెరచి సౌత్ ఈస్ట్ డివిజన్లోనే మొట్టమొదటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా నిలిచాడు.  అత్యధిక పొదుపు ఖాతాలను తెరవడానికి ఏఎస్పీ నర్మద మేడం అదేవిధంగా మెయిల్ ఓవర్సీర్ కొలను రాజు తోడ్పాటు  అందించడం జరిగింది.  అందులో భాగంగా ఈరోజు సౌత్ ఈస్ట్ డివిజన్ సీనియర్   సూపరింటెండ్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ . టీవీయే. శర్మ  ఆదిబట్ల బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ను సందర్శించి  బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మురళీధర్ ని మరియు  ఎం ఓ రాజు ని సన్మానించి, ప్రశంసించడం జరిగింది.   బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మురళీధర్ మాట్లాడుతూ పోస్ట్ ఆఫీస్ సేవలను  ఆదిబట్ల గ్రామంలో  అతి తొందరలోనే ప్రతి  గడపగడపకి  సేవలను విస్తృత పరుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల గ్రామ ప్రజలు మరియు రాందాస్ పల్లి బ్రాంచ్ పోస్టుమాస్టర్  ఆంజనేయులు గారు  పాల్గొనడం జరిగింది