పట్టణాలు అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

Published: Friday July 09, 2021
కోరుట్ల పట్టణ 16 వార్డు కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి
కోరుట్ల, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణాలు అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని అందుకోసమే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని 16వ వార్డ్ కౌన్సిలర్ బలిజ పద్మ రాజారెడ్డి అన్నారు గురువారం పట్టణ ప్రగతి లో భాగంగా వార్డులో జెసిబి ట్రాక్టర్లతో రోడ్లపై ఉన్న మట్టిని సద్దులు చేసి పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సూచనలతో వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లెల తో పాటు పట్టణాలు అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో పట్టణ ప్రగతి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా వార్డులో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు పట్టణ ప్రగతి నిధులతో మురికి కాలువల నిర్మాణం సిమెంట్ రోడ్లు నిర్మాణం జరిగి వార్డు సుందరంగా తయారవుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు ఉయ్యాల నర్సయ్య, చిన్నయ్య, ఎండి ఆఫీస్, మతిన్, శివ, మున్సిపల్ అధికారులు పేట అశోక్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.