మోమిన్ పేట్ లో అత్యాధునిక వేద ఆసుపత్రి

Published: Thursday March 02, 2023
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 01 మార్చి ప్రజాపాలన : రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వేద ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. బుధవారం
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మోమిన్ పేట్ మండల కేంద్రంలో అత్యాధునిక వేద ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులకు మంచి వైద్య చికిత్సలు అందించాలని కోరారు. వేద ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ వేద ఆసుపత్రిలో కేర్ క్వాలిటీ సర్వీస్ మూడు లక్ష్యాలను నిర్దేశించుకున్నామని స్పష్టం చేశారు. వేద ఆసుపత్రి ప్రత్యేకతలు ప్రసూతి శాస్త్రం గైనకాలజీ లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఆర్థోపెడిక్ ట్రామ్ కేర్ కీళ్ల మార్పిడి నడుము నొప్పి సమస్యలు జనరల్ మెడిసిన్ డయాబెటాలజీ థైరాయిడ్ చికిత్స జనరల్ సర్జికల్ ల్యాబ్ సౌకర్యం వంటి వైద్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. 24/7 అత్యవసర సేవలు కూడా అందించబడతాయని వివరించారు. అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో కలదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు లక్ష్మీకాంత్ రెడ్డి నిరోషా రెడ్డి మోమిన్పేట్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి దేవరంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.