గెలుపోటములు కాదు ప్రజాసేవే ముఖ్యం : మాజీ కార్పొరేటర్ శేషు కుమారి

Published: Monday January 10, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : రాజకీయాలలో గెలుపు ఓటములు ముఖ్యం కాదని ప్రజాసేవకు అంకితమైన వారే నిజమైన నాయకులని అన్నారు అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషు కుమారి. ఎస్ ఆర్ నగర్ లోని స్ట్రీట్ నం.8 లో ఎప్పట్నుంచో చెత్త సమస్య నెలకొని స్థానికంగా ఎవరు పట్టించుకోకపోవడంతో స్థానికులు మాజీ కార్పొరేటర్ శేషు కుమారి దృష్టికి తీసుకురావడంతో ఆమె మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయానికి సమాచారం అందించి సమస్య మంత్రి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన మంత్రి తలసాని సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీ వాసులు చొరవ చూపి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేసిన మాజీ కార్పొరేటర్ శేషు కుమారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శేషు కుమారి మాట్లాడుతూ ఓడినా గెలిచినా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని, రాజకీయాలు ఎన్నికలు అప్పుడే గానీ మిగతా రోజుల్లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలని వాసులు గౌతం, రాజేష్, స్టీవెన్, రామకృష్ణ మరియు తెరాస నేతలు బలరాం, రాజు ముదిరాజ్,శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.