పోచమ్మ దేవాలయంలో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పూజలు

Published: Saturday August 27, 2022

జగిత్యాల, ఆగస్టు 26 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ దేవాలయంలో 60 వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, ఆలయ కమిటి సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శుక్రవారం సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.