జిల్లాకౌన్సిలర్ల సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలిని ఘనంగా సన్మానించిన మున్సిపల్ చైర్మన్

Published: Thursday November 24, 2022
 చౌటుప్పల్ నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): యాదాద్రి భువనగిరి జిల్లా కౌన్సిలర్ల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన 20వ వార్డు కౌన్సిలర్ బాబా షరీఫ్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన 10వ వార్డు కౌన్సిలర్ బొడిగె అరుణ బాలకృష్ణ గౌడ్ ని చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు ఘనంగా సన్మానించి అభినందించారు. చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వీరిని సన్మానించిన అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని కౌన్సిలర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు కొరగోని లింగస్వామి, తాడూరి శిరీష పరమేష్, కొయ్యడ సైదులు, ఆలే నాగరాజు, బండమీది మల్లేశం, కామిశెట్టి శైలజ భాస్కర్, ఉబ్బు వరలక్ష్మి వెంకటయ్య, సందగళ్ల విజయ సతీష్, సుల్తాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.