ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ సమావేశం
Published: Wednesday November 09, 2022
మధిర రూరల్ నవంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలోని మంగళవారం నాడుమాటూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అభివృద్ధి కమిటీ సమావేశం ఎంపీపీ మొండెం లలిత అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలు ప్రజలు రైతులు కలుపుకుంటూ అనేక సంక్షేమాలు ప్రజలకు అందించి మేలైన ప్రభుత్వంగా నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అని ఆమె అన్నారు అదేవిధంగా ఆరోగ్యం విషయంలో ప్రజలు ప్రైవేటు హాస్పటల్ దీటుగా ప్రభుత్వం హాస్పిటల్ లోని అన్ని రకాలు వైద్యం అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారని ఆమె తెలిపారు . ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావూరి శివ నాగకుమారి, వైద్యులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు*
Share this on your social network: