సాయిబాబాకాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
Published: Wednesday November 23, 2022
మేడిపల్లి, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ డివిజన్ సాయిబాబా కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు కార్పొరేటర్ అధికారులతో కలిసి కాలనీలో విస్తృతంగా పర్యటించారు.
కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, లో ఓల్టేజి సమస్య పరిష్కారం కోసం నూతనంగా ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి దృష్టికి తెచ్చారు.
త్వరలోనే కాలనీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటుకు కృషి చేయనున్నట్టుగా ఈ సందర్భంగా మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు రజనీకాంత్ రెడ్డి ,సత్యనారాయణ, మున్సిపల్ డిఈ నిఖిల్ రెడ్డి, ఎఈ వసంత, శానిటేషన్ అధికారి చందన,ఎస్ ఎస్ మహేశ్వర్ రెడ్డి ,సాయిబాబా కాలనీ అధ్యక్షులు అంజి రెడ్డి ,దేవి రెడ్డి ,రత్నం ,సుమన్ శర్మ ,సత్తి రెడ్డి, బిక్షపతి ,జంగ రెడ్డి ,నర్సింహా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: