ఎల్లకొండకు రానున్న ఎమ్మెల్యే సీతక్క

Published: Monday December 19, 2022
* మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్
వికారాబాద్ బ్యూరో 18 డిసెంబర్ ప్రజా పాలన : ఊరడమ్మ విగ్రహం మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సీతక్క సోమవారం రానున్నారని నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి, టిపిసిసి సెక్రెటరీ మధుసూదన్ రెడ్డి, జిల్లా, నియోజకవర్గం, మండల నాయకులు వస్తున్నారని వివరించారు. గ్రామ దేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగస్వాములుగుటకు రానున్నారని స్పష్టం చేశారు. అమ్మవారి అనుగ్రహం ఆశీస్సులు సదా గ్రామ ప్రజలకు రక్షణ కవచంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామదేవత ఊరడమ్మ కు మొక్కులు చెల్లించుకుని పూజా పూజా కైంకర్యాలు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లకొండ గ్రామ ప్రజలతోపాటు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని  కాంగ్రెస్ పార్టీ సహకార సంఘం చైర్మన్, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, జిల్లా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు.