ప్రజలకు అతి తక్కువ ధరకే త్రాగునీరు అందించడం అభినందనీయం మాజీ కౌన్సిలర్ కోనా సుచరిత*

Published: Tuesday December 20, 2022

మధిర డిసెంబర్ 19 ప్రజాా పాలన ప్రతినిధి
 మధిర పట్టణ ప్రజలకు కేవలం ఐదు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ అందించడం ఎంతో అభినందనీయమని మాజీ కౌన్సిలర్ కోన సుచరిత పేర్కొన్నారు సోమవారం పట్టణంలోని 15వ వార్డులో కటకం రాఘవాచారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ విగ్నేశ్వర సాయి బాలాజీ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాభపేక్ష లేకుండా, సేవా మార్గంతో ప్రజలకు తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేసిన సాయి బాలాజీ వాటర్ ప్లాంట్ ముందు ముందు మరింత అభివృద్ధి సాధించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కోన ధని కుమార్ ప్లాంట్ అధినేత కటకం రాఘవాచారి విజయ్ తదితరులు పాల్గొన్నారు