రెండు పడక గదుల ఇండ్లను అర్హులైన వారికి సిద్ధం చేయాలి ** గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డ

Published: Friday November 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 24 (ప్రజాపాలన, ప్రతినిధి) : పేదవారికి గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడకల గదుల ఇండ్ల పథకంలో  అర్హులైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నాటికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్డు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఉన్నతాధికాలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ 18, వేల 328 కోట్ల వ్యయంతో 2,91 లక్షల రెండు పడకల గదుల ఇండ్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జి హెచ్ ఎం సి, పరిది మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 62 వేల రెండు పడకల గదుల ఇల్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయని తెలిపారు. ఇండ్లకు త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్, వంటి మౌలిక వసతుల కల్పనకు 205 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, పనులు చేపట్టి పూర్తిచేయాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తుది దశ నిర్మాణంలో ఉన్న 40 వేల ఇండ్లు పూర్తి జరిగేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు.
 సోమేశ్ కుమార్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై జిల్లాకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని, జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్యాయం వేసుకొని పంపిణీ సిద్ధం చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో రెండు పడగల గదుల ఇండ్ల పథకంలో572 ఇండ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారుల ఎంపికకు ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని, అన్నారు. నిర్ణీత సమయానికి త్రాగునీరు,డ్రైనేజీ,విద్యుత్ రోడ్లు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్పాయ్, సురేందర్, మణెమ్మ, కాగజ్నగర్ ఆర్డిఓ రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.