పార్కు స్థలం కాపాడాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రికి వినతి

Published: Thursday November 18, 2021
బాలాపూర్, నవంబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడో డివిజన్ కార్పొరేటర్ లార్డ్స్ చిన్న బీరప్ప, కాలనీవాసులు ఆధ్వర్యంలో లక్ష్మీ నగర్ కాలనీలో పార్కుస్థలం కబ్జాకు గురవుతుందని, కబ్జాకు గురికాకుండా కాపాడాలని, ఆ పార్క్ చుట్టు  పహరి గోడ ను నిర్మించాలని, స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రాన్ని మీర్ పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి సమక్షంలో అందజేశారు. మంత్రి వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు అతితొందరలో పార్కు చుట్టూ పహరి గోడ నిర్మించాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నగర్ కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు, జనరల్ సెక్రెటరీ, తదితరులు పాల్గొన్నారు.