మున్సిపాలిటీలో పలు వార్డులు పర్యటన చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్

Published: Friday July 15, 2022

మధిర జూలై 14 ప్రజాపాలన ప్రతినిధి గురువారం నాడు టిఆర్ఎస్ నాయకులు వార్డు కౌన్సిలర్ పలు వార్డులోమున్సిపాలిటీ పరిధిలోని 9 మరియు 10 వార్డుల్లో అవార్డు కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులతో కలిసి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు  ఈరోజు పర్యటించారు ఈ సందర్భంగా వార్డులో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అభివృద్ధిలో 9 మరియు 10 వార్డు కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు ఆదర్శంగా నిలిచారన్నారు. వార్డులో అక్కడక్కడ కాళీ స్థలాల్లో నిలిచి ఉన్న వర్షపు నీరు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరు శ్రీనివాసరావు కనుమూరు వెంకటేశ్వరరావు అరిగే శ్రీనివాసరావు మెండెం వెంకన్న  గద్దల నాని తదితరులు పాల్గొన్నారు.