రామ మందిరానికి నిధి సమర్పణ

Published: Thursday February 11, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్; జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు , మాజీ సింగిల్విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ మండలం లో వివిధ వర్గాలకు చెందిన దాతల ద్వారా  రాము డు జన్మించిన, రామ జన్మ భూమి  అయోధ్యలో భవ్య మందిరం నిర్మాణం చేపట్టాలని కోరుతూ నిధి సమర్పణ కార్యాన్ని విశ్వహిందూ పరిషత్,  రామజన్మ భూమీ తీర్థ క్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు  కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా  నిధి  మొత్తము రెండు లక్షల పన్నెండు వేల ఎనిమిది వందల 85 రూపాయల ( రూ 2,12,8 85) ల చెక్కును బుధవారం నాడు విశ్వహిందూ పరిషత్ కార్యాయంలో  వి హెచ్ పి  అఖిలభారత కార్యదర్శి  శ్రీ సత్యం గారి సమక్షంలో   కార్యాలయ కార్యదర్శి గారికి అందజేయడం  జరిగినది.  ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జాతీయ కార్యదర్శి సత్యం  మాట్లాడుతూ..... రామజన్మ భూమి అయినా అయోధ్యలో రాముడు యొక్క భవ్య మందిరాన్ని చిరకాల కోరిక నెరవేరుస్తున్న సందర్భంగా ప్రజలంతా సంతోషాలతో ముందుకు వచ్చి నిధి సమర్పణ చేయడం చాలా సంతోషకరం అన్నారు.  ఏ పార్టీ వారు అయినా ఏ హిందూ సంస్థలైన ప్రతి హిందు వూ...   రాముని వారసుడిగా ముందుకు వచ్చి నిధి సమర్పణలో పెద్ద ఎత్తున  సమర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ననుచున్న  వారందరినీ విశ్వ హిందూ పరిషత్  పేరుపేరునా  ప్రోత్సహిస్తూ స్వాగతీస్తుందని అన్నారు. రామజన్మభూమి క్షేత్ర ట్రస్టు సంస్థకు స్వచ్ఛందంగా ప్రతి ధనిక రాజకీయాలు కులాలు మతాలు సంబంధం లేకుండా రాముడు నా ఆరాధ్య దైవంగా భావించే ప్రతి వ్యక్తి  నిధి సమర్పణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన వలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అందరికి  భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు  ఉంటాయన్నారు.