సమావేశం కు రానీ అధికారుల పై ఫిర్యాదు. చేస్తా ఎంపీడీవో..

Published: Saturday June 26, 2021
పాలేరు, జూన్ 27, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించటం జరిగినది సమావేశమునకు హజరు కానీ వివిధ శాఖల అధికారుల పై అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీవో యం, చంద్రశేఖర్, తెలిపారు. స్థానిక మండల పరిషత్ సర్వ సభ్య సమావేశం వైస్ ఎంపీపీ పతానపు నాగయ్య, అధ్యక్షత న జరిగింది. ఈ సందర్భంగా పలు శాఖల ప్రగతి సమీక్షలను చదివి వినిపించారు. తొలుత సమావేశం కు చాలా శాఖల అధికారులు రాకపోవటంతో ఎంపీడీఓ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి సమావేశంకు శాఖల నివేదికలతో తప్పకుండా అందరూ హజరు కావాలని అలా కాని వారి పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కు చర్యల కోసం ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఐకేపీ ఏపీఎం ఆశోక రాణి  కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ధనలక్ష్మి, యం.పీ.వో. నెల్లూరి వెంకటేశ్వర్లు, డాక్టర్, రాజేష్, ఏపీవో సునీత, ఏఈ లు ఓంప్రకాష్, బాలాజీ, సర్పంచ్ లు రాయపూడి నవీన్, గండు సతీష్, పెంట మల్ల పుల్లమ్మ, వల్లాల రాధాకృష్ణ, రేగురి శ్రావణ్ కుమార్, సుజాత, ఎంపీటీసీ లు వెంకటలక్ష్మి, కల్పన, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.