శాంతియుతంగా జరిగిన దసరా ఉత్సవాలు
Published: Saturday October 08, 2022
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్
వికారాబాద్ బ్యూరో 7 అక్టోబర్ ప్రజాపాలన : దసరా శరన్నవరాత్రులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతియుతంగా జరుపుకోవడం అభినందనీయమని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి గ్రామంలో శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలంపల్లిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో దసరా నవరాత్రులు ముగించుకొని తిరుగు ప్రయాణమై అనంతగిరిపల్లి గ్రామం మీదుగా వెళ్తూ భక్తులందరినీ ఆశీర్వదించుకుంటూ అనంతగిరి పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రెడ్యానాయక్, ఇతర నాయకులు, అనంతగిరి పుణ్యక్షేత్ర అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: