ఈనెల 23వ తేదీన మత్స్యగిరి ఆలయంలో టెండర్ కం బహిరంగ వేలం

Published: Saturday March 20, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయంలో తలనీలాలు సమకూర్చుకోనుటకు,కొబ్బరికాయలు అమ్ముకొనుటకు, వాహన పూజా సామాగ్రి,వాహన టోల్ గేట్ నిర్వాహణ, కూల్ డ్రింక్, హోటల్ నిర్వాహణ, శ్రీ సత్యనారాయణ వ్రత సామాగ్రి అమ్ముకొనుటకు, బొమ్మల దుకాణం, ఫోటో స్టూడియో,పూల దుకాణం అమ్ముకొనుటకు ఆలయ ప్రాంగణంలో ఈ నెల 23 వ తేదీన టెండర్ కం వేలం పాటలు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి గల వారు సకాలంలో హాజరై టెండర్ లో పాల్గొనవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి రవి కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.బహిరంగ వేలంలో పాల్గొనే హౌత్సహికుల నుండి సీల్డ్ టెండర్లను కోరుతున్నామని, సీల్డ్ టెండర్ కొటేషన్లను ఈ నెల 23 న మంగళవారం మధ్యాహ్నం12 -30 గంటలకు దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్ లో వేయాలని అనంతరం బహిరంగ వేలం పాట నిర్వహిస్తామని ఆయన తెలిపారు.