దుపట్లు పంపిణీ చేసిన రెడ్ క్రాస్ సొసైటీ*

Published: Friday February 10, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 09, ప్రజాపాలన: రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న  కోలంగూడ
వాసులకు గురువారం రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తరపున బ్లాంకెట్స్, హైజినిక్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామమైన కోలంగూడలో నివసిస్తున్న వారికి పరిశుభ్రత పై, విద్య పై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు. వారి యొక్క జీవనశైలిలో మార్పు రావాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, జిల్లా కోశాధికారి పడాల రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, ఎస్.నాగేందర్, రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యుడు కాసర్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.