వరద నీటి కాలువల పనులకు నిధులు విడుదల చేయాలని వినతి

Published: Wednesday June 23, 2021
మేడిపల్లి, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నియోజకవర్గంలో వరద నీటి కాలువల పనులకు నిధులు విడుదల చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రగతి భవన్ లో మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుకు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో వరద నీటి కాలువల పనులకు రూ.124.64 కోట్లు వ్యయం విడుదల చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మంత్రివర్యులు కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్  సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తెలిపారు.