బాధ్యతతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి సి ఐ మురళి
Published: Friday April 08, 2022
మధిర ఏప్రిల్ 27 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు పోలీస్ సర్కిల్ పరిధిలో పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్స్ ను సన్మానించిన సీఐ మురళి బాధ్యతతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మధిర సిఐ వడ్డేపల్లి మురళి సూచించారు మధిర పోలీస్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుల్ గా పనిచేసి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన పలువురు హెడ్ కానిస్టేబుల్స్ ను స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతి పొందిన వారు విధినిర్వహణలో ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
Share this on your social network: