*పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్* పంట పొలాల్లోకి చేరిన నీరు*
Published: Monday September 05, 2022
మధిర సెప్టెంబర్ 3 ప్రజాపాలన ప్రతినిధి పట్టణంలోని వైరా రోడ్ లోని పివిఆర్ కళ్యాణ మండపం సమీపంలో శనివారం మిషన్ భగీరథ ప్రధాన పైపులైన పగిలింది దీంతో త్రాగునీరు వృధాగా పోయింది. మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ పగిలి సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి భారీ స్థాయిలో తాగునీరు చేరింది. దాదాపు మూడు గంటల పాటు మిషన్ భగీరథ పైప్ లైన్ కు సంబంధించిన అధికారులు ఎవరూ ఆ ప్రాంతానికి రాకపోవడంతో వృధాగా తాగునీరు పోయింది. పైప్ లైన్ పలిగి పంట పొలాల్లోకి నీరు రావడంతో రైతులు ఆందోళన చెంది నీరు రాకుండా కట్టలు పట్టుకున్నారు
Share this on your social network: