భవన నిర్మాణ కార్మికుల కమిటీ ఎన్నిక
ఇబ్రహీంపట్నం మే తేది 30 ప్రజాపాలన ప్రతినిధి.ఈరోజు పోల్కంపల్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీకి ముఖ్య అతిథులుగా సి ఐ టి యు ఇబ్రహీంపట్నం మండల కమిటీ సభ్యులు చెరుకూరు నరసింహ హాజరయ్యారు నరసింహ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ఈ ఎస్ ఐ ఇన్సూరెన్స్ పిఎఫ్ ఉన్న సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నూతన కమిటీ ద్వారా గ్రామంలో ఉన్న ప్రతి కార్మికుడు యూనియన్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని కార్మికుల అందర్నీ కోరారు. ప్రమాదవశాత్తు భీమా వర్తించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి గ్రామంలో కమిటీ ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని నరసింహ తెలిపారు.
నూతన కమిటీ
అధ్యక్షులుగా భతెప్పు బిక్షపతి
ఉపాధ్యక్షులుగా
కంబాలపల్లి శ్రీనివాస్
కావాలి నరసింహ
కార్యదర్శిగా
కావలి బాలరాజు
సహాయ కార్యదర్శులు గా
పంది దనేశ్వర్
కట్టెల యాదగిరి
గారిని ఎన్నుకోవడం జరిగింది దీనితోపాటు 50 మంది భవననిర్మాణ కార్మిక సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: