సావిత్రిబాయి పూలే కు ఘన నివాళులు

Published: Wednesday January 04, 2023
చేవెళ్ల: (ప్రజాపాలన) 
 చేవెళ్ల  మండలం దామరగిద్ద గ్రామంలో అంబేద్కర్ భవనంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా దామరగిద్ద  అంబేద్కర్ సంఘ అధ్యక్షులు మాచనపల్లి రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆడపిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడుతూ అందించిన సావిత్రిబాయి పూలే సేవలు మరువలేని రామస్వామి కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.