మెరుగైన చికిత్స అందించండి : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
Published: Friday December 10, 2021
వికారాబాద్ బ్యూరో 09 డిసెంబర్ ప్రజాపాలన : బుధవారం తెల్లవారుజామున పీరంపల్లి గ్రామానికి చెందిన 16 మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బోల్తా పడి గాయపడిన క్షతగాత్రులను హైదరాబాద్ లోని ఆలివ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితి చాలా విషమంగా ఉందని, అందులో ఒకరికి ఆపరేషన్ చేయడం జరిగిందని వైద్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. హాస్పిటల్ దగ్గర అందుబాటులో ఉన్న గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి, క్షతగాత్రుల బంధువులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Share this on your social network: