అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. బూర్గంపాడు అదనపు ఎస్సై రమణారెడ్డి

Published: Saturday September 24, 2022
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల TSRJC గురుకుల పాఠశాలలో బూర్గంపహాడ్ అదనపు SI రమణా రెడ్డి విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం ద్వారా పలు సూచనలు చేశారు.ముఖ్యంగా అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని అలాంటి వ్యక్తుల పై ఏమైనా అనుమానం ఉంటే వెంటనే 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.విద్యార్ధినిలు మంచి చదువుని అభ్యసించుకొని ఉన్నత చదువులు చదివి భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గురుకుల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ అనిత,పోలిస్ సిబ్బంది కానిస్టేబుల్ సురేష్ నాయుడు,రవి అదేవిధంగా పాటశాల సిబ్బంది విద్యార్థినిలు ఉన్నారు.