మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జెడ్పీ చైర్మన్
Published: Thursday March 10, 2022
బోనకల్, మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని కలకోట, బ్రాహ్మణపల్లి గ్రామాలలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కలకోట గ్రామంలో ఇటికల శ్రీనివాసరావు సోదరుని కుమార్తె ఒణిల అలంకరణ వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం బ్రాహ్మణ పల్లి గ్రామంలో ఇటీవల స్వల్ప రోడ్డుప్రమాదంలో గాయ పడిన కృష్ణని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా గుజ్జర్లపూడి నాగభూషణం ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొనకల్ మండల కలకోట, బ్రాహ్మణ పల్లి గ్రామాల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: