కోరుట్ల జడ్పిటిసి కి తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం

Published: Monday July 18, 2022

కోరుట్ల, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి):
వేములవాడ పట్టణంలో తెలుగు వెలుగుసాహితీ  వేదిక సంస్థ  ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిస్వార్ధంగా సమాజానికి సేవ చేసే వారిని ఎంపిక చేసి పురస్కారంతో పాటు అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా కోరుట్ల జడ్పిటిసి సభ్యులు దారిశెట్టి లావణ్య-రాజేష్   సేవలను గుర్తించి వేములవాడ పట్టణంలో జరిగిన తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సేవ సంస్థ  మరియు చొప్పదండి శాసన సభ్యులు  రవిశంకర్ అధ్వర్యంలో తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారం 2022 అవార్డును లావణ్య కు అందజేసి, సన్మానించారు. ఈ సంధర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ , ఎంపీపీ తోట నారాయణ, సర్పంచులు అంజయ్య, రాజ నర్సయ్య, లింగారెడ్డి, మరియు నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.