రైతు బంధు డబ్బులు వెంటనే మంజూరు చేయాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ

Published: Friday June 17, 2022

రాష్ట్ర నాయకుడు
మాదగోని జంగయ్య గౌడ్*

మంచాల మండల వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట సహాయం కోసం పంపిణీ చేసే రైతు బంధు డబ్బులు ఇప్పటికే మంజూరు చేయవలసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మంజూరు చేయటం లేదో అర్థం కావటం లేదు అన్నారు పియం కిషన్ పథకానికి చెందిన డబ్బులు సరైన సమయంలో రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి రైతులు కొద్దీ పటి వర్షాలు కురావటంతో భూములు సాగు చేసుకుంటున్నారు అయిన ఇప్పట్టి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేయలేదు ప్రతి ఏడాది రైతు బంధు డబ్బుల మంజూరు చేయటం ఆలస్యం అవుతుంది ఈ ఏడాది మరింత ఆలస్యం కావటంతో రైతులు రైతు బంధు డబ్బులకోసం ఎదురు చూస్తున్నారు రైతులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల తో చెలగాటం అడుతున్నాడు లక్ష రూపాయల లోపు రుణాలు పూర్తి స్థాయిలో మాపి చేస్తాను అని గొప్పలు చెప్పి ఏండ్లు గడుస్తున్నా ఇప్పట్టి వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు అన్నారు.వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించి రైతు బంధు డబ్బులు మంజూరు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలి రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి.అని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రైతులకు మాట ఇచ్చి మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాబోయే రోజుల్లో రైతులు తగిన గుణపాఠం చెప్పి గద్దె దించటం కాయం అన్నారు