ప్రేమ పేరుతో వేధించిన మానవ మృగానికి ఉరిశిక్ష వేయాలి – ధారావత్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయ
వికారాబాద్ బ్యూరో 27 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రేమ పేరుతో మానసికంగా కృంగే విధంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న ధారావత్ ప్రీతి మృతికి కారణమైన మొహమ్మద్ సైఫ్ ను ఉరితీయాలని అఖిల భారత గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కరంతోట్ రాఘవన్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి బిజెఆర్ చౌరస్తా వరకు ధారావత్ ప్రీతి మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యయత్నం పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజ్ మెడికో విద్యార్థిని ప్రీతి బాయి మరణానికి కారణం అయిన సైఫ్ ను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలేజీ హెచ్ ఓ డి, ప్రిన్సిపాల్ లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొoడ్రాయి గ్రామ గిరిజన తెగకు చెందిన ధారావత్ నరేందర్ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు.
Share this on your social network: