మేయర్కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు
Published: Wednesday September 01, 2021
బాలాపూర్: ఆగస్టు 31, ప్రజాపాలన న్యూస్ (ప్రతినిధి) : బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బాలాపూర్ శివాలయంలో, వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ గోకులాష్టమి సందర్భంగా స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి. శ్రీ కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని వేణు గోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుష్టులను తుదిముంటిచి కలియుగాన్ని (లోకాన్ని) సన్మార్గంలో నడిపించడానికి భగవంతుడు ఎత్తిన అవతారమే శ్రీ కృష్ణ అవతారమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ కృష్ణ రెడ్డి, పన్నాల గోపాల్ రెడ్డి, ఆంజనేయ చారి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: