మండల కేంద్రంలో ఘనంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు

Published: Wednesday April 06, 2022
బోనకల్, ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేద్రంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బోనకల్ గ్రామ సర్పంచ్ సైదానాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సైదా నాయక్ మాట్లాడుతు భారత ఉప ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నటువంటి బాబు జగ్జీవన్ రావు దేశానికి ఎనలేని సేవలు చేశారని, అదేవిధంగా రాజకీయంగా యువత ముందుండి గ్రామాలను అభివృద్ధి పదంలో ఉంచాలని పిలుపునిచ్చారనీ అన్నారు. అందువల్ల ఈ రోజుల్లో కూడా మనం రాజకీయ చైతన్యంగా ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళను రాజ్యాధికార దిశగా పయనించాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దారేల్లి రమేష్, స్వేరో జిల్లా అధ్యక్షుడు జగదీశ్, వార్డు నెంబర్ ఉప్పర శ్రీను, గ్రామ యూవత, బిజెపి యువనేత బీపీ నాయక్, అంతోటి శివ కృష్ణ, అచ్యుత్, త్రినాధ్, ఈశ్వర్, నాని, బాబురావు, వేణు, ప్రసాద్, రమేష్ నాయక్, కిషోర్, సైదులు, తదితరులు పాల్గొన్నారు.