మధిరలో ఘనంగా మహిళా దినోత్సవం

Published: Tuesday March 09, 2021

మధిర, మార్చి 08 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మండల, పట్టణ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం లో చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్ పర్సన్ విద్యా లత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి లను జ్ఞానపీఠ అధ్యక్షులు రామకృష్ణ తిలక్ శాలువా కప్పి సత్కరించారు. అనంతరం వార్డ్ కౌన్సిలర్లను చైర్ పర్సన్ శాలువా కప్పి సన్మానించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మొండెం లలిత ఆధ్వర్యంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల మహిళా సర్పంచులను, ఎంపీటీసీ లను సన్మానించడం జరిగింది. ఎల్ఐసి కార్యాలయం లో నిర్వహించిన మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్ పర్సన్ మొండితోక లత ఎల్ఐసి కార్యాలయం లో మహిళా సిబ్బందిని అభినందించారు. ఎమ్మార్వో కార్యాలయంలో లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి ఎమ్మార్వో డి సైదులు శాలువాలతో సత్కరించారు. సైదుల్ పురం గ్రామంలో సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో గ్రామానికి సంబంధించిన వార్డ్ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయంలో విజయ భాస్కర్ రెడ్డి, ఎమ్మార్వో సైదులు, ఎల్ఐసి మేనేజర్ ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.