ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి *ఈనెల 30 తేదీ న బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమి
*బుడగ జంగాల హక్కుల పోరాట సమితి జెండా ఆవిష్కరణ జరుపుకోవాలని పిలుపు*
తెలంగాణ రాష్ట్ర బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గగనం మంతప్ప మాట్లాడుతూ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి సంఘం ఈనెల 30న ఆవిర్భవించి 20. వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, 21వ ఆవిర్భావ దినోత్సవ జెండా ఆవిష్కరణ కార్యక్రమమును గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయివరకు,తెలంగాణలో ఆవిర్భావ దినోత్స వాన్ని ఒక పండగలా జరపాలని ఆయన అన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామ, మండల, తాలూకా, జిల్లాలలోని హక్కుల పోరాట సమితి వివిధ ప్రాంతాల సంఘ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, మేధావులు, కుల పెద్దలు, యూత్ ఫెడరేషన్ యువకులు విద్యార్థులు మేధావులు యావత్ నాయకులు బేడ బుడగ జంగాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మీ గ్రామాలలో, మండలాల్లో, జిల్లాకేంద్రాలలో ఉన్న కమిటీ హల్ భవనం ముందు, సంఘ బోర్డుల దగ్గర ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరుపుకోవాలని ఆయన అన్నారు. అదే విధంగా సంఘంలో ఉత్తమమైన సేవలు అందించి, అమరులైనటువంటి నాయకులకు ఐదు నిమిషాలు మౌనం పాటిస్తూ ఈ కార్యక్రమాలను జరపాలని ఆయన పిలుపునిచ్చారు.
Share this on your social network: