ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారాదులు పాత్రికేయులు. చేవెళ్ల, అక్టోబర్ 17 (
Published: Tuesday October 18, 2022
పాత్రికేయులు వివిధ రకాల పత్రికల్లో ప్రతినిధిగా పనిచేస్తున్న పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం కేంద్రంలో ఆదివారం విలేకరులతో కలిసి ఆయన ముచ్చటించారు.పాత్రికేయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ... ప్రతినిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి మద్య వారదులుగా నిరంతరం సేవలందిస్తున్న పత్రిక రంగ పాత్రికేయుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో... పత్రికల పాత్రికేయులు నరేందర్, రమేష్,ఆనంద్,సురేందర్, రాఘవేందర్, నర్సింలు, శేఖర్, బిఆర్ఎస్ నాయకులు పెద్దోళ్ల ప్రభాకర్ రవీందర్ లు ఉన్నారు.
Share this on your social network: