బోడుప్పల్లో రూ 4.22 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

Published: Friday December 09, 2022
మేడిపల్లి, డిసెంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ 4.22 కోట్లతో పలు అభివృద్ధి పనులను కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిిి రవి గౌడ్, కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు. ద్వారకా నగర్లో 2 కోట్లతో మరియు సాయి భవాని నగర్లో 2 కోట్లతో చేపట్టే నాలా పనులు మరియు 13వ డివిజన్  దేవేందర్ నగర్లో 22 లక్షలతో కూడిన 

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నాలా కట్టిన ప్రాంతాల్లో పర్యటన చేసి కాలనీ వాసులతో ముచ్చటించారు. తదుపరి మేయర్ బోడుప్పల్ ప్రధాన రహదారులను అభివృధి చేసేందుకు ప్రభుత్వ నిధులు మంజూరు చేయాలనీ మంత్రికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటార్లు, కో అప్షన్ సభ్యులు, కమీషనర్ పద్మజారాణి,  రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.