ఎస్ ఫ్ ఐ అఖిల భారత మహాసభలకు బయలుదేరిన చేవెళ్ల డివిజన్ నాయకులు
చేవెళ్లడిసెంబర్13, (ప్రజాపాలన):-
ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభల సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద నిర్వహించే బహిరంగ సభకు చేవెళ్ల డివిజన్ నుంచి ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ్ కుమార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ 17వ అఖిలభారత మహాసభలు హైదరాబాద్లో 13 నుంచి 16 వరకు జరుగుతున్నాయని ఈరోజు హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజా వద్ద జరిగే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా త్రిపుర మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ మాణిక్ సర్కార్ గారు హాజరవుతున్నారని అదేవిధంగా జాతీయ అధ్యక్ష కార్యదర్శులు విపి సాను మయూబిశ్వాస్ జాతీయ గర్ల్స్ కన్వీనర్ దీప్సితాదార్ ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు అయిషాగోష్ ఎస్ఎఫ్ఐ జాతీయ నాయకులు సచిన్ దేవ్ ఎమ్మెల్యే తదితర ముఖ్య నాయకులు హాజరవుతున్నారని ఈ మహాసభలు విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు అల్లి దేవేందర్ శంకర్పల్లి మండల నాయకులు రాహుల్ వికాస్ నవీన్ అనిల్ శివ నవీన్ ఉదయ్ గణేష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: