ఇబ్రహింపట్నం ఏప్రిల్ తేదీ 11 ప్రజాపాలన ప్రతినిధి **మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగ

Published: Wednesday April 12, 2023

మహాత్మ జ్యోతిరావు పూలే 196వ జయంతిని పురస్కరించుకొని  మంగళవారం వడ్డెర వృత్తిదారుల సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తుర్కయాంజాల్ లో ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొంచెం వెంకటకృష్ణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లపు విగ్నేష్ లు మాట్లాడుతూ మహాత్మ పూలే దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో త్యాగం చేశారని అన్నారు. అంతేకాకుండా కుల నిర్మూలన కోసం అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని అదే విధంగా స్త్రీ విద్య కోసం పాఠశాలలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేశారన్నారు ముఖ్యంగా కుల వివక్షత కు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మన ఆశయ బాటలో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వడ్డెర వృత్తిదారుల సంఘం నాయకులు ఎడికట్ల.నందకుమార్  గణ ప్రసాద్, తన్నీరు.సైమన్ తదితరులు పాల్గొన్నారు,