కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాలి

Published: Tuesday April 27, 2021
- ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్
వికారాబాద్ ఏప్రిల్ 26 ప్రజాపాలన బ్యూరో : వికారాబాద్ జిల్లాలో  వ్యాక్సినేషన్ కేంద్రాలను పెంచాలని ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నవీన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు, జిల్లా వైద్యాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని వ్యాక్సిన్ కేంద్రాలను పెంచితే అందరికీ టీకా వేయించడం సులభమవుతుందని పేర్కొన్నారు. మే ఒకటవ తేదీ నుండి 18 సంవత్సరాలు పైబడిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్న నేపథ్యంలో రద్దీ పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని గుర్తు చేశారు. ఇప్పుడు మనకు ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాలు సరిపోక పోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు, కమిటీ హాల్స్ లలో ప్రభుత్వ అనుకూల కార్యాలయాలలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.