తోటి మిత్రులు ఆర్థిక సహాయం అందజేత

Published: Wednesday February 24, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రానికి చెందిన లక్ష్మీపతి లాక్డౌన్ సమయంలో మృతి చెందడంతో మృతునితో చదువుకున్న బ్యాచ్ తోటి మిత్రుల సౌజన్యంతో 47 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. మృతుని కూతురు పైచదువులకు భవిష్యత్తులో సహాయం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలకుంట్ల శ్రీనివాస్, మైసోళ్ల మత్స్యగిరి, యార శ్రీశైలం, పబ్బు స్వామి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.