ప్రజానాట్యమండలి నూతన మండల కమిటీ ఏర్పాటు

Published: Wednesday October 13, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం, కాసులకు అమ్ముడుపోని కళాకారులు ప్రజానాట్యమండలి కళాకారులు అని ఇబ్రహీంపట్నం ప్రజానాట్యమండలి మండల మహాసభలో రంగారెడ్డి జిల్లా కార్యదర్శి గడ్డం గణేష్ అన్నారు. కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం మనం పాడే పాట ఆడే ఆట మాట అన్యాయాన్ని అక్రమాలను ప్రశ్నించే విధంగా ఉండాలి ప్రజానాట్యమండలి కళాకారుల ప్రజలతో మమేకమై నిత్యం చైతన్యవంతులుగా చేస్తూ ప్రజల కోసం కలం, గళం తో ప్రజల కొరకు పాటలు పడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రజానాట్యమండలి మండల మహాసభ 17 మంది తో నూతన మండల కమిటీ వేయడం జరిగింది. ఎనిమిది మందితో డాన్స్ కమిటీ వేయడం మండల అధ్యక్షునిగా జంగిలి మహేష్, కార్యదర్శిగా పి.ధనేశ్వర్, సహాయ కార్యదర్శులుగా సుధాకర్ అంజయ్య,  ఉపాధ్యక్షులుగా జగన్, ధనంజి, శేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి వినోద్ కుమార్, రాష్ట్ర నాయకులు ఎమ్మార్ యాదగిరి, రాజశేఖర్ లు పాల్గొన్నారు.